వరుడికి కరోనా.. అయినా పెళ్లి చేసుకున్న వధువు

వరుడికి కరోనా.. అయినా పెళ్లి చేసుకున్న వధువు

భోపాల్: పెళ్లి చేసుకోబోయే వాడికి కరోనా సోకిందని తెలిసినా ఓ అమ్మాయి ధైర్యం చేసింది. పీపీఈ కిట్లు వేసుకొని ఓ జంట ఒక్కటైన ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగింది. దేశంలో కరోనా భీకరంగా విజృంభిస్తోంది. రోజుకు లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. వైరస్ వ్యాప్తి భయంతో ఫంక్షన్లు, వేడుకలు చేసుకోవాలనునున్నా జనాలు భయపడుతున్నారు. అయితే ఈ జంట మాత్రం కరోనాకు జంకకుండా ఒక్కటయ్యారు. పలువురు సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. పెళ్లికి వచ్చిన ఒకరిద్దరు బంధువులు కూడా పీపీఈ కిట్లు ధరించారు. ఈ విషయంపై రత్లాం తహసీల్దార్ నవీన్ గార్గ్ మాట్లాడుతూ.. పెళ్లి కొడుకు‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. తాము పెళ్లిని ఆపడానికి వెళ్లామని, కానీ వరుడి కుటుంబీకులు బతిమిలాడటంతో సీనియర్ అధికారుల సూచనలతో వివాహం జరిపించామన్నారు.